JN: పాలకుర్తి మండల కేంద్రంలోనీ సోమనాధుని మ్యూజియంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, తాగుబోతులకు అడ్డాగా మారిపోతుందని బంజారా హక్కుల పోరాట సమితి వ్యవస్థపాక అధ్యక్షుడు బానోత్ మహేందర్ నాయక్ శనివారం పాలకుర్తి ఎమ్మార్వో ని కలిసి వినతి పత్రం అందజేశారు. శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు అందుబాటులో తేవాలని, పరిశుద్ధత పాటించాలని కోరారు.