ADB: ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు నగేష్ లక్ష్మణచందా, మామడ మండలాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమం చేపట్టారు. పట్టభద్రులు, టీచర్లను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అంజిరెడ్డి, కొమురయ్యను గెలిపించాలని కోరారు. ఆయన వెంట నాయకులు నారాయణరెడ్డి, పదాధికారులు, కార్యకర్తలు తదితరులున్నారు.
MNCL: బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంలో ఇంటిని కోల్పోయిన బాధితుడు భీమయ్య కుటుంబ సభ్యులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ శనివారం పరామర్శించారు. అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి ఎంపీ హామీ ఇచ్చారు.
KMM: ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. కామేపల్లి(M) క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించి తనిఖీ చేశారు. వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేయాలన్నారు.
KMM: మధిర సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసు కుటుంబ సభ్యులందరూ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐపీఎస్ అధికారి రిత్విక్ సాయి కోరారు. శనివారం మధిర సీ.ఐ కార్యాలయంలో ఖమ్మంకు చెందిన శరత్ మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఉచితంగా ఏర్పాటుచేసిన కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
MNCL: బెల్లంపల్లి పట్టణ రైల్వే స్టేషన్లో వికలాంగులు, వృద్ధులు, మహిళల సౌకర్యార్థం ఎస్కలేటర్, లిఫ్ట్ ఏర్పాటు చేయాలని మాజీ కౌన్సిలర్లు, ఎంపీ వంశీకృష్ణకి శనివారం వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు బెల్లంపల్లిలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. పట్టణంలోని రాంనగర్ అండర్ బ్రిడ్జి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
BHPL: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సందర్భంగా భక్తులు భారీగా పెరిగారు. భక్తులు ముందుగా గోదావరిలో స్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేస్తున్నారు. పార్వతి అమ్మవారికి కుంకుమ పూజలు చేసి, నవగ్రహ కాలసర్ప పూజలు నిర్వహించి మొక్కులు చెల్లిస్తున్నారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోనీ సోమనాధుని మ్యూజియంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, తాగుబోతులకు అడ్డాగా మారిపోతుందని బంజారా హక్కుల పోరాట సమితి వ్యవస్థపాక అధ్యక్షుడు బానోత్ మహేందర్ నాయక్ శనివారం పాలకుర్తి ఎమ్మార్వో ని కలిసి వినతి పత్రం అందజేశారు. శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు అందుబాటులో తేవాలని, పరిశుద్ధత పాటించాలని కోరారు.
HNK: చిల్పూర్ మండలం ఫతేపూర్, గార్లగడ్డ తండా గ్రామాల పరిధిలోని పంట పొలాలను శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పొలాల వద్దకు వెళ్లి పంట ఏవిధంగా ఉంది, సాగు నీరు అందుతుందా అనే విషయాలను ఎమ్మెల్యే రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్లన్నగండి రిజర్వాయర్ వద్దకు వెళ్లి రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ను పరిశీలించారు.
HNK: జిల్లా కేంద్రానికి విచ్చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలను సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హనుమకొండ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై కాసేపు అరుణతో నేతలు చర్చించారు. కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వరంగల్: రాయపర్తి మండలం గన్నరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొకటి రాజు కుమారుడు మొకటి రిషి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపటి శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50కేజీల బియ్యం, నూనె డబ్బాను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదిరులు పాల్గొన్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్లోని పలు కాలనీల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కుక్కల బెడద తీర్చాలని అధికారులకు స్థానికులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థానిక కార్పొరేటర్, అధికారుల ఆదేశాలమేరకు ప్రత్యేక బృందం ఈ రోజు వివేకానందకాలనీలో కుక్కలను పట్టుకున్నారు. డివిజన్లోని అన్ని కాలనీలలో కుక్కల బెడద తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.
MNCL: తెలంగాణ జన సమితి పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్గా మందుగుల హరిప్రసాద్ నియామకమయ్యారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బాబన్న, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శనివారం హరి ప్రసాద్కు నియామక పత్రం అందజేశారు.
NRML: కుబీర్ మండలంలోని పల్సి గ్రామం పాఠశాల విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. పాఠశాల ఆవరణలోని చెట్లకు గుళ్లుగా కట్టి వాటిలో పక్షులకు ఆహారం, నీరు ఉంచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. వేసవికాలం సమీపిస్తున్న వేళ విద్యార్థుల స్వయంకృషితో తయారు చేసిన గుళ్లు, పక్షులకు ఆహారం, నీరు అందించడం పట్ల అభినందించారు.
ADB: ఇటీవల హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను శనివారం ఆదిలాబాద్లో డీసీసీబీ చైర్మన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను శాలువాలతో సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు.
NLG: బొమ్మలరామారం మండలం సోలిపేటకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేమురి కృష్ణ గౌడ్ కూతురు వినీషా రవీందర్ గౌడ్ ల వివాహానికి, శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.