• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన BRS జిల్లా అధ్యక్షుడు

MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన సాదిక్ పాషా ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న BRS జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు శనివారం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS శ్రేణులు ఉన్నారు.

March 28, 2026 / 05:45 PM IST

గుంతలమయమైన రహదారి.. ప్రజల ఆవేదన

GDWL: అలంపూర్ నుంచి కాశాపురం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. బీటీ రోడ్డు నిర్వహణ లేకపోవడంతో వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు లేదా నూతన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

March 28, 2026 / 05:45 PM IST

‘నిరుద్యోగులు గ్రంథాలయ సేవలను వినియోగించుకొవాలి’

BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం పాల్వంచ శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. నిరుద్యోగులు గ్రంథాలయ సేవలను వినియోగించుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు.

March 28, 2026 / 05:41 PM IST

వేసవి శిక్షణ శిబిరానికి ఎంపీ అరుణ సహకారం

WNP: అమరచింతలో ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు విద్యార్థుల కోసం నిర్వహించే వేసవి శిక్షణ శిబిరానికి ఎంపీ డీకే అరుణ, దేశాయి ప్రకాశ్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం అమరచింతకు వచ్చిన వారిని ఓ ఫౌండేషన్ ప్రతినిధి బాలకృష్ణ కలిసి సహకారం కోరగా, సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

March 28, 2026 / 05:38 PM IST

అగ్ని వీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: భారత సైన్యం 2027 నియామక సంవత్సరానికి అగ్నివీర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి శనివారం తెలిపారు.1 జులై 2005 నుంచి 1 జులై 2009 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 1 లోపు www. joinindianrmy.nic.in లో నమోదు చేసుకోవాలన్నారు.

March 28, 2026 / 05:34 PM IST

ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆర్డీవోకు వినతి

NLG: నల్లగొండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ ఆర్డీవోకు వినతిని సమర్పించారు. నాలుగేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం, మంత్రి నిర్లక్ష్యం వహించడం సరికాదని సీపీఎం నేత ఎండీ సలీం విమర్శించారు. కలెక్టర్ చొరవ చూపి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

March 28, 2026 / 05:30 PM IST

మండలంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

MBNR: మూసాపేట్ మండలంలోని వేముల, దాసర్‌పల్లి, కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత ముఖ్యఅతిథిగా హాజరై, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సొంతింటి కలను నిజం చేసినందుకు గ్రామస్థులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

March 28, 2026 / 05:30 PM IST

ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి: కలెక్టర్

NZB: జిల్లాలో ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలగకుండా అధికారులు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కార్పొరేటర్లు సూచించే ప్రజా సమస్యలను అంకితభావంతో పరిష్కరించాలని కోరారు. డివిజన్ల సమస్యలపై చర్చించేందుకు నెల రోజుల్లోపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

March 28, 2026 / 05:30 PM IST

ఇందిరమ్మ ఇళ్లతో ఇంటింటా సౌభాగ్యం: డీసీసీ అధ్యక్షులు

KMR: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ శనివారం మద్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో పర్యటించారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేద కుటుంబాల్లో సౌభాగ్యం కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. లబ్ధిదారురాలు చాకలి జయశ్రీ నూతన గృహాన్ని ఆయన స్వయంగా ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.

March 28, 2026 / 05:30 PM IST

తెలంగాణ జాగృతిలోకి భారీగా చేరిన నేతలు

MDCL: జాగృతి అధికార ప్రతినిధి మనోజ ఆధ్వర్యంలో మల్కాజిగిరి జిల్లా రామంతపూర్కు చెందిన లెక్చరర్ అసోసియేషన్ సభ్యులు, కుత్బుల్లాపూర్, దుండిగల్, మల్లంపేట్, షాపూర్ ప్రాంతాలకు చెందిన పలువురు మహిళలు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, వారికి కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు.

March 28, 2026 / 05:30 PM IST

హజ్ యాత్రికులకు టీకాల పంపిణీ

SRPT: హజ్ యాత్రికుల ఆరోగ్య రక్షణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. DMHO డా. పెండెం వెంకటరమణ మాట్లాడుతూ.. యాత్రికులు తప్పనిసరిగా మెనింజైటీస్, ఇన్‌ఫ్లుయెంజా, పోలియో టీకాలు వేయించుకోవాలని సూచించారు. 40 మంది యాత్రికులకు టీకాలు వేయడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

March 28, 2026 / 05:30 PM IST

పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా స్థాయి ప్యానల్ బృందం

SDPT: చిన్నకోడూర్ మండల పరిధిలోని రామంచ ప్రాథమిక పాఠశాలను జిల్లా స్థాయి ప్యానల్ తనిఖీ బృందం పద్మారెడ్డి, నాగేందర్, లక్ష్మీ నారాయణ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల మోడల్ లెసన్స్, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

March 28, 2026 / 05:26 PM IST

‘పది’ పరీక్షలో 11 మంది గైర్హాజరు

జగిత్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా 4వ రోజు జరిగిన గణితం పేపర్కు మొత్తం 12,694 మంది విద్యార్థులకు 12,683 మంది పరీక్షకు హాజరుకాగా, కేవలం 11 మంది మాత్రమే గైర్హాజరయ్యారు.హాజరు శాతం 99.91 నమోదైంది.సప్లమెంటరీ విద్యార్థులు 24 మందికి గాను 17 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ బి.ఎస్. లత పరిశీలించారు

March 28, 2026 / 05:26 PM IST

అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన మేయర్

KNR: కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ‘సాక్షం’ అంగన్వాడీ కేంద్రంలో వాటర్ ప్యూరిఫైర్‌ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లాలోని 269 కేంద్రాల్లో ఒక్కోదానికి రూ.లక్షతో టీవీలు, పోషణ వాటికలు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల హాజరు శాతం పెంచాలని కోరుతూ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు.

March 28, 2026 / 05:25 PM IST

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

MHBD: చిన్నగూడూరు మండలకేంద్రంలోని పదవతరగతి పరీక్షకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులు సైతం ఎటువంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని సూచనలు చేశారు.

March 28, 2026 / 05:25 PM IST