NGKL: తెల్కపల్లి మండలం కార్వంగ గ్రామంలో నూతన సీసీ రోడ్లకు శుక్రవారం ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్వంగ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలుగుతుందన్నారు.
NZB: భీమగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్, డ్రై స్వీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు దారులు స్థానికులై ఉండాలని, 7వ తరగతి బోనాఫైడ్ జతచేసి పాఠశాలలో అందజేయాలని కోరారు.
NLG: బోడుప్పల్లోని కేశవనగర్లో ఏర్పాటు చేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గోటూరు గ్రామంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ బహుజనుల ఆత్మ గౌరవ ధూంధాం కళాకారులచే ఒక సమావేశం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.నాయకులు యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు గౌతం కోరారు.
BDK: ఇల్లందు మండలం మాణిక్యరం గ్రామంలో శుక్రవారం సీతారామచంద్ర స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మనసారా కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశించారు. నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ, 3వ తరగతి ఎఫ్ఎల్ఎన్/ ఎఫ్ఎల్ఎస్ పరీక్షల డీఈవో సూచించారు.
RR: తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, మహేశ్వరం నియోజకవర్గం నాగారం గ్రామానికి చెందిన సిరిపురం యాదయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
KNR: గంగాధర మండలంలోని బురుగుపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దులం కళ్యాణ్ ఆధ్వర్యంలో కిరాణా, చికెన్, మటన్ షాప్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్లాస్టిక్ కవర్లకు బదులుగా బయోడీగ్రేడబుల్ కవర్లు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా MPDO ప్లాస్టిక్ వల్ల పర్యావరణం నష్టాలను వివరించారు.
HYD: నగరంలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్తో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అదే తరహా సందేశం రావడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
SRPT: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద నిర్మించిన సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను, అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మున్సిపల్ వైస్ చైర్మన్ను కోరారు. అనంతరం ఆయనను ప్రైవేట్ ఉపాధ్యాయులు సన్మానించారు.
HYD: జీవో నం. 15 ప్రకారం మాల్స్ లేదా మల్టీప్లెక్స్లో మొదటి 30 నిమిషాలు పార్కింగ్ పూర్తిగా ఉచితం. ఒకవేళ అక్కడ షాపింగ్ చేస్తే గంట వరకు ఉచితంగా ఉండాలి. కానీ, మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని కొన్ని ప్రధాన మాల్స్ ‘డిజిటల్ ఎంట్రీ’ పేరుతో వాహనం లోపలికి వెళ్లకముందే సమయాన్ని లెక్కిస్తున్నాయి. లోపల సమయం వృథా అయ్యేలా చేసి రూ. 50 నుంచి రూ. 100 వసూలు చేయడం గమనార్హం.
GDWL: నడిగడ్డ భక్తుల ఆరాధ్యదైవం, జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని గద్వాల నూతన మున్సిపల్ ఛైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు శుక్రవారం సందర్శించారు. ఆలయ ఈవో పురందర కుమార్, అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వారికి శ్వేత వస్త్రాలు సమర్పించారు.
HYD: నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని హైదరాబాద్-2 డిపో నుంచి రాకపోకలు సాగించే బస్సులకు సంబంధించి ప్రయాణికుల నుంచి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు నేడు సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు 9959226249 నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ పరిశీలించారు. అనంతరం కాసేపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో ఛైర్మన్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
BDK: జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో పశు వైద్యశాల శిథిలావస్థకు చేరింది. దీంతో పశు వైద్య సిబ్బంది పశువులను తీసుకొచ్చిన రైతులు లోపలికి వెళ్లాలంటే భయపడుతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న పశు వైద్యశాలను తొలగించి నూతన పశువైద్యశాలను నిర్మించాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు.