తెలంగాణలో… టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… ఈ కేసులో…జగ్గు స్వామికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులకు జగ్గుస్వామి అందుబాటులోకి లేకుండా పరారవ్వడంతో… ఈ లుకౌట్ నోటీసులు ఇవ్వడం గమనార్హం. దీంతో కేరళలోని ఓ ఆశ్రమ ప్రతినిధులకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ కేసులో నిన్న అడ్వకేట్...
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో, ఆయన బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సోదాల్లో భాగంగా… ఆయన ఫోన్ ని కూడా…. అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కన్వీనర్ కోటాకి బదులు ప్రైవేట్ వ్యక్తులకు కోట్లకు అమ్ముకున్నారని విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం నాలుగు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్...
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి… ఇటీవల హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆయన టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారని… అందుకే ఇలా కాళ్లు మొక్కారంటూ వారత్లు వచ్చాయి. ఒక ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి ముఖ్యమంత్రి పాదాలకు నమస్కారం చేయడం ఏంటనే విమర్శలు వచ్చాయి. ఐతే ఈ విమర్శలపై శ్రీనివాసరావు తాజాగా స్పందించారు. ఒక్కసారి కాదు...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది.తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం.. కార్యాలయాల్లో ఈ తెల్లవారు జాము నుంచి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డితో పాటుగా ఆయన సోదరులు, కుమారుడు – అల్లుడి ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఒకే సారి 50 టీంలు ఈ దాడులు మొదలు పెట్టాయి. సికింద్రాబాద్.. కొంపల్లిలో ఐటీ అధికారులు ఒకే సమయంలో ఈ దాడులు మొదలు పెట్టారు. మల్లారె...
ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విధానంలో టీఆర్ఎస్ కీ, బీజేపీకి చాలా తేడా ఉందని… టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ శిక్షణా శిబిరాల్లో అధికారం కోసం అడ్డదారులు తొక్కం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు కానీ కిషన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదా...
హైదరాబాద్లోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టుగా ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ పరిసరాల్లో దాదాపు గంట సేపటి నుంచి బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. చార్మినార్ దగ్గర ఫుట్పాత్లపై షాపులను కూడా తొలగించారు. ఘటనాస్థలికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ప...
కాంగ్రెస్ నేతలకు, టీపీసీసీ అనుబంధ సంఘాల నేతలకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ను లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని, పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరం సహచరులమేనని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండకపోతే పార్టీ ఉనికి ప్రమాదంలో పడుతుందని, గతంలో చేపట్టిన కార్యక...
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై ఇటీవల టీఆర్ఎస్ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ దాడి జరిగినట్లు… పోలీసుల దర్యాప్తులో తేలింది. కవితపై పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల, ఆ ప్రెస్మీట్లను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్లే దాడి జరిగినట్లు పోలీసుల...
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుతున్నారా..? ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఆయన నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం జరిగింది. ఈ భేటీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ , బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా హాజరయ్యారు. గురువా...
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబసభ్యులను బెదిరించడంతో పాటు…. ఇంటిని చాలా వరకు ధ్వంసం చేశారు. కాగా…. ఆయన ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ దాడికి సంబంధించి మొత్తం 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో టీఆర్ఎస్ నేతలు రాజా, రామ్ యాదవ్, టీఆర్ఎస్వీ నేత స్వామి వున్నారు. వారిని మె...
తన కూతురు కవితను పార్టీ మారమని కోరారంటూ ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. ఇవే మాటలను కవిత కూడా చెప్పారు. తనను పార్టీ మారమని బీజేపీ నేతలు సంప్రదించారంటూ కవిత చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. కాగా… ఈ విషయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కవితను పార్టీ మారమని కోరిందెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సిట్ దర్యాప్తు చేయాలని కోరారు. కవిత స్టే...
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్… అరవింద్ కి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత… టీఆర్ఎస్ కార్యకర్తతల తీరుపై మండిపడ్డారు. భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే...
బీజేపీ ఎంపీ అరవింద్ కు…. నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత… స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరవింద్ తనపై చేసిన వ్యాఖ్యలపై కవిత సీరియస్ అయ్యారు. చెప్పుతో కొడతానంటూ ఆమె వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఎంపీ అరవింద్ బురద లాంటి వాడని, ఇప్పటి వరకు ఏం చేసినా పట్టించుకోలేదన్నారు. తన గురించి మరోసారి వ్యక్తిగతంగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. తనకు ...
టీఆర్ఎస్ ని వీడి… బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేత ఈటల. అయితే… గత కొద్ది రోజులుగా.. కేసీఆర్ ఈటలకు ఫోన్ చేశారని.. మళ్లీ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారంటూ ప్రచారం జరుగుతోంది. ఈటల కూడా మళ్లీ టీఆర్ఎస్ లోకి వెళ్లడానికి ఆసక్తి చూపించినట్లు వార్తలు ఊపందుకున్నాయి. కాగా… ఈ క్రమంలో వీటిపై తాజాగా ఈటల క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి తాను తిరిగి టీఆర్ఎస్ లో &...