• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వనపర్తి పురపాలక పీఠంపై మాధవి బాధ్యతల స్వీకరణ

WNP: వనపర్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మిడిదొడ్డి మాధవి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛైర్‌పర్సన్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్‌ను శాలువాతో సత్కరించారు. మున్సిపల్ కమిషనర్, నూతన కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:38 PM IST

తెలంగాణలో కుల మతాలకతీతంగా పండుగలు

SRPT: తెలంగాణలో కుల మతాలకతీతంగా పండుగలు నిర్వహించడం ఆనవాయితీ అని మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ ఉల్లా తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలోని శ్రీసంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి మాట్లాడారు. శ్రీ సంతోషిమాత దేవాలయం కమిటీ సభ్యులు ప్రతి ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.

February 20, 2026 / 02:37 PM IST

ఆలయ నిర్మాణానికి భూమి పూజ

SRCL: చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు శుక్రవారం భూమి పూజా చేశారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, దాతల సహకారంతో ఆలయ నిర్మాణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతరాజు భారతి నగేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామంలోని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:36 PM IST

ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం

RR: షాద్‌నగర్ మున్సిపల్ కొత్త పాలకవర్గం కొలువుతీరిన వేళ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు నూతన పాలకవర్గం శాలువతో సత్కరించి పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఎల్లప్పుడూ వెంట ఉండి ముందుకు నడిపించడంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కౌన్సిలర్లు, పాలక వర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టడంతో అక్కడ ఆనందం వెళ్లి విరిసింది.

February 20, 2026 / 02:36 PM IST

విఠల్ రెడ్డి చొరవతో దాగం రోడ్డుకు మోక్షం

NRML: తానూరు మండలంలోని దాగం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అధికారుతో మాట్లాడి గ్రావెల్ రోడ్డు మంజూరు చేయించారు. ఇందుకు కృతజ్ఞతగా గ్రామస్తులు విఠల్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

February 20, 2026 / 02:35 PM IST

ఏసీబీకి చిక్కిన కోర్డు సిబ్బంది

BHPL: జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రూ.5 వేల లంచం తీసుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీకి పట్టుబడ్డారు. పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్) రజిత, కొమ్ము సునీతలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో న్యాయవాది సీహెచ్ గోపాలరావు ఏసీబీని ఆశ్రయించారు.

February 20, 2026 / 02:35 PM IST

రాష్ట్రస్థాయి పోటీలకు హర్షిత ఎంపిక

MNCL: రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలకు తాండూర్ మండలం అచ్చలాపూర్ ZPHS విద్యార్థిని చౌల్ల హర్షిత ఎంపికైనట్లు పీడీ సాంబమూర్తి శుక్రవారం తెలిపారు. జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలలో హర్షిత బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయిందన్నారు. ఈనెల 21 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో హర్షిత పాల్గొంటుందన్నారు.

February 20, 2026 / 02:35 PM IST

సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్

WGL: గీసుకొండ(M) కేంద్రంలోని గంగాదేవి పల్లె గ్రామంలో రెండో విడత సర్పంచుల ఓరియంటేషన్ శిక్షణ శిబిరంలో ఇవాళ అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాల నెలకొన్న సమస్యలు పరిష్కరించి సూచించారు. ఈ కార్యక్రమంలో మెరుగు సుమలత పాల్గొన్నారు.

February 20, 2026 / 02:34 PM IST

అగ్నివీర్ పరీక్షలకు ఉచిత శిక్షణ: కలెక్టర్

PDPL: జిల్లాలో అగ్నివీర్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష శుక్రవారం తెలిపారు. ఈనెల 23లోపు అభ్యర్థులు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈనెల 25న మెడికల్ పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని తెలిపారు. మే 31 వరకు శిక్షణ ఉంటుందని, టెన్త్ పాసైన 17.5-22 సంవత్సరాల మధ్య వయసుగల పురుష అభ్యర్థులు అర్హులన్నారు.

February 20, 2026 / 02:34 PM IST

ప్రభుత్వ ఐటీఐలో ప్రవేశానికి ఆహ్వానం

BDK: ప్రభుత్వ ఐటీఐలో షార్ట్‌టర్మ్‌లో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వ శిక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని కొత్తగూడెం ప్రిన్సిపాల్ రమేష్ నేడు తెలిపారు. పీఎంకేవీవై ద్వారా సీఎన్సీ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, త్రీడీ ప్రింటర్ కోర్సులకు కొత్తగూడెంలో, సీఎన్సీ ప్రోగ్రామర్, ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులకు శిక్షణ ఉందన్నారు.

February 20, 2026 / 02:34 PM IST

పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఒక వరం: ఆడే గజేందర్

ADB: ఇచ్చోడ మండలం మన్నూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమానికి లబ్ధిదారుని ఆహ్వానం మేరకు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శుక్రవారం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన గృహ ప్రవేశ పూజల్లో పాల్గొని, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

February 20, 2026 / 02:30 PM IST

ఛలో సెక్రటేరియట్ పోస్టర్ విడుదల

SRCL: తమ డిమాండ్ల సాధన కోసం టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఉద్యోగుల ఛలో సెక్రటేరియట్ పోస్టర్‌ను శుక్రవారం వేములవాడ ఆర్టీసీ డిపో ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు కాళిదాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిందని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు.

February 20, 2026 / 02:30 PM IST

మూసీ సుందరీకరణ.. స్థానికుల సహాయ నిరాకరణ

HYD: గోల్కొండ, రాజేంద్రగనర్, గండిపేట మండలాల పరిధిలో మూసీ సుందరీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ భూములు, స్థలాలు సేకరించాల్సి ఉంది. అయితే స్థానికులు ఇందుకు ససేమిరా అంటున్నారు. తమ స్థలాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని స్థానికులు అధికారులకు తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉండగా భూముల సేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు దాదాపు 1000 నోటీసులు ఇచ్చారు.

February 20, 2026 / 02:25 PM IST

చికిత్స పొందుతూ మాజీ సర్పంచ్ మృతి

SRD: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కంగ్టి మండలం చుక్కలతీర్థం మాజీ సర్పంచ్ రమేష్ పాటిల్(49) ఇవాళ మృతి చెందారు. ఈ నెల 10న పొలం పనులపై రాసోల్ వెళ్లి తిరిగి రాత్రి తడ్కల్‌కు వెళ్తుండగా ముర్కుంజాల్ శివారులో బైకు అదుపుతప్పి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఆస్పత్రిలో బ్రెయిన్ ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమించి మరణించారు.

February 20, 2026 / 02:25 PM IST

నూతన ఛైర్ పర్సన్‌లను సన్మానించిన మంత్రి

NRPT: మక్తల్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా వాకిటి మానస హన్మంతు, వైస్ ఛైర్ పర్సన్‌గా కుమారి శైవీ రెడ్డి పదవీ బాధ్యతలు ఇవాళ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి లలిత హాజరయ్యారు. కార్యాలయంలో పూజల అనంతరం ఇరువురినీ వారి వారి కుర్చీల్లో కూర్చోబెట్టి, సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 20, 2026 / 02:24 PM IST