కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకటో వార్డ్ బరిలో ట్రాన్స్ జెండర్ వడ్ల మమత నిలిచారు. తనను వార్డ్ సభ్యురాలిగా గెలిపించాలని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాగా, ట్రాన్స్ జెండర్ మమతను గెలిపించుకుంటామని ఒకటో వార్డ్ ఓటర్లు హామీ ఇస్తున్నారు. దీంతో ఆమె మరింత ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారు.