BDK: మణుగూరు మున్సిపాలిటీ శివలింగాపురం పరిశుద్ధ లూకా దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. క్రైస్తవులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ అని, ఏసుక్రీస్తు జన్మించిన శుభ దినాన అందరికీ మంచి జరగాలని తెలిపారు.