కామారెడ్డి పట్టణంలోని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా కామారెడ్డి పట్టణంలో మంగళవారం “యోగా వాక్” నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో పతంజలి యోగా సంస్థ సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో వీణ గారు జెండా ఊపి యోగా వాక్కు శ్రీకారం చుట్టారు.