NLG: దళితుల సంక్షేమం అంటేనే కేసీఆర్ పాలన గుర్తుకు వస్తుందని, వారికోసం పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం వినాయకరావు నగర్ బీఆర్ఎస్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ దళితుల ఆత్మగౌరవం అంటూ కొత్త నాటకానికి తెరలేపిందని పేర్కొన్నారు.