SDPT: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆధ్వర్యంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలకు బుధవారం శిక్షణ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు నిబంధనలను ఉల్లంఘించకుండా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆమె సూచించారు. రూ. 50 వేలకు మించి నగదు తరలించేటప్పుడు సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేయాలన్నారు.