NLG: కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన పోలగోని బలరాం సోమవారం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కేతేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.