MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవస్థానంలో మంగళవారం అమ్మవారికి భౌమ వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గుణ మాసం కృష్ణపక్షం త్రయోదశి స్థితి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. పవిత్రవ్యాలు పట్టు వస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.