HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. సాయంత్రం షేక్పేట డివిజన్లోని హనుమాన్ దేవాలయం వద్ద సభను నిర్వహించనున్నారు. అనంతరం రహమత్ నగర్ డివిజన్ లోని ఎస్పీఆర్ హిల్స్, శ్రీరామ్ నగర్ పీజేఆర్ సర్కిల్ వద్ద జరిగే సభలో పాల్గొననున్నారు.