SRPT: తుంగతుర్తికి చెందిన బచ్చు తిరుమలరావు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన మృతదేహానికి బుధవారం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, గుండగాని రాములు గౌడ్, తునికి సాయిలు, యాదగిరి, శ్రీను, రవికుమార్, వీరోజి తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.