KMR: జిల్లా భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామసభ ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొల్ల రాములు అనే వ్యక్తి గతంలో పొందిన పెన్షన్ ప్రస్తుతం నిలిచిపోయిందని, పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చెట్టెక్కి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్పందించిన గ్రామ పాలకవర్గ సభ్యులు అతడిని కాపాడారు.