KMR: దోమకొండ రోడ్డుపై తిరుగుతున్న వాహనాలను మంగళవారం ఎస్సై స్రవంతి తనిఖీని చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ కార్లు నడిపిస్తున్న వారు సీట్ బెల్టు తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్ , పొల్యూషన్ పత్రాలు ఉండాలని ఆమె సూచించారు. రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించి వాహనాలు నడపాలని ఎలాంటి పత్రాలు లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామన్నారు.