JGL: అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 62 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్ రావు, పాల్గొన్నారు.