SRPT: నూతనకల్ మండల మాజీ జడ్పీటీసీ కందాల దామోదర్ రెడ్డిని ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో సూర్యాపేటలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సామేలు కలిసి పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు సామ అభిషేక్ రెడ్డి, గుడిపల్లి మధుకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వీరస్వామి ఉన్నారు.