MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ సందర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించారు. జిల్లా బీఆర్ఎస్ నాయకులు వెంట రాగా మాజీ ఎమ్మెల్యే సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయపరమైన కోరిక తీర్చాలని డిమాండ్ చేశారు.