ADB: వేసవికాలం నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాలలో నీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఈవో జితేందర్ రెడ్డి, అధికారులు తదితరులున్నారు.