MBNR: దేవరకద్ర మండలం జీనుగారాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బంగారు వెంకటేష్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ ఇంఛార్జి కొండా ప్రశాంత్ రెడ్డి ఆయనకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు BJP పార్టీలోకి చేరడం జరిగింది. వెంకటేష్ను సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి నిలబెడుతున్నట్లు ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.