రంజాన్ పండుగను పురస్కరించుకొని గద్వాలలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు సహా పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు కలెక్టర్ రుద్రం భాషను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోదరా భావంతో పండుగ జరుపుకోవాలని కలెక్టర్ తెలిపారు.