BDK: బూర్గంపాడు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. సారపాకలోని పలు కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.