ADB: మార్కెట్ యార్డ్లో సొయా పంట కొనుగోలులో వేలిముద్ర నిబంధనలు తొలగించాలని రైతులకు, రైతు కుటుంబాలకు సౌకర్యంగా ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని వర్తింపజేయాలని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పత్తి కొనుగోలు విధంగానే సోయా కొనుగోల్లను OTP విధానం ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.