BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని కొత్తపల్లి (కె) గ్రామానికి చెందిన సుమలత ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ను ఎంపీడీవో కక్షతో నిలిపివేశారని మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. అర్హత ఉన్న తమ ఇంటిని కావాలనే ఆపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఐ ద్వారా ప్రశ్నించగా, ఎమ్మెల్యే ఆదేశాలతో నిలిపినట్లు MPDO సమాధానం ఇచ్చారని వాపోయారు.