NZB: మోపాల్ మండలం నరసింగపల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రానికి మంగళవారం త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రానున్నట్లు ఆలయ ధర్మకర్త నర్సింహారెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చేపౌర్ణమి సందర్భంగా ఒక దివ్య ప్రసాదాన్ని సంతానం లేని వారికి ఆలయంలో పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. సాయంత్రం 4గంటలకు నిర్వహించే కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారని ఆయన వివరించారు.