KNR: శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. కొత్తగట్టు గ్రామంలోని జాతీయ రహదారిపై ముందుగా నాట్లు వేసుకున్న కొంతమంది రైతులు ధాన్యం నూర్పిడి చేసి ఆరబెట్టుకున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా వచ్చిన వర్షంతో రైతులు ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకోవడం కోసం టార్పాలిన్ కవర్లను కుప్పలపై కప్పి ఉంచారు.