NGKL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సంస్కృతి, సాహిత్యంలో వాల్మీకి మహర్షి ఆదికవిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.