SRD: ఆర్ఆర్ఆర్ కోసం బలవంతపు భూ సేకరణ నిలిపివేయాలని కోరుతూ నెల 27వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ కోరారు. సంగారెడ్డిలో ఇవాళ ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తుందని ఆరోపించారు. దీన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు.