KMM: ఆరోగ్యం పట్ల ప్రజలు శ్రద్ధ వహించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగేందర్ అన్నారు. ఆదివారం ఖమ్మం 46 డివిజన్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు అనంతరం పలువురికి ఆయన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.