గౌహతి టెస్టులో భారత బౌలర్లు తేలిపోయారు. 247/6 స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా.. లంచ్ బ్రేక్ సమయానికి 428/7 చేసింది. క్రీజులో ముత్తుస్వామి(107), యాన్సెన్(51) పాతుకుపోయారు. ఈ రోజు ఆటలో వికెట్లు తీసేందుకు IND చెమటోడ్చినా ఫలితం దక్కట్లేదు. ఇలాగే కొనసాగితే మ్యాచ్ చేజారే ప్రమాదం ఉంది. ఇప్పటికే సిరీస్లో ప్రత్యర్థి 1-0తో ఆధిక్యంలో ఉంది.