WNP: సత్యసాయి బాబా చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఇవాళ కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సాయిబాబా శత జయంతి సందర్భంగా ఐడీవోసీ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. ప్రజాసేవకై ట్రస్ట్ ఏర్పాటు చేసి బాబా చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ఆయన చూపిన సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు సహాయం చేయాలని కలెక్టర్ సూచించారు.