NRML: తానూర్ మండలంలోని హిప్నెల్లి గ్రామంలో పాఠశాల అభివృద్ధి పనులకు సర్పంచ్ గంగ సాగర – శివరాం శ్రీకారం చుట్టారు. సుమారు 27 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పాఠశాల భవన మరమ్మతులు, అదనపు వసతుల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్యను అందించడమే తమ లక్ష్యమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాల్గొన్నారు.