MDK: దసరా కానుకగా స్వయంగా సహకార సంఘాల వారికి చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల చీరల తయారీ పూర్తికాగా మరో 10 లక్షల చీరలు ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి రూ.800 ఖర్చు అయినట్టు అధికారులు తెలిపారు.