KMR: కామారెడ్డిలో ఆదివారం పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. ఓటు హక్కు కలిగిన స్వర్ణకారులు అధికారుల పర్యవేక్షణలో తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం వెలువడిన ఫలితాల ప్రకారం.. మరికంటి శ్రీనివాస్ అధ్యక్షుడిగా, బస్వాపురం ప్రభాకర్ ప్రధాన కార్యదర్శిగా, శేషు కుమార్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.