HNK: దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో సుభాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మంగళవారం BRS నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.