KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 69,322 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులోకి 66,149 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 13.574 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు. కాలువకు 1,000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది.