WGL: వర్ధన్నపేట మండల కేంద్రంలోని దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. అనంతరం భక్తులు అమ్మవారిని పుష్పాలతో అలంకరించారు. అర్చకులు కలకోట గోపాల్ చారి ఆధ్వర్యంలో, కలకోట శ్రావణ్, కలకోట రామాచారి, ప్రశాంత్, పూజలు నిర్వహిస్తున్నారు.