AP: ఆంధ్రా యానివర్సిటీలో తీవ్ర అస్వస్థతతో మణికంఠ అనే విద్యార్థి గురువారం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు వీసీ చాంబర్ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మణికంఠ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏయూ పాలకులు, డిస్పెన్సరీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఏయూ వీసీ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తున్నారు.