GNTR: 11 విలీన గ్రామాలతో ఉన్న గుంటూరు నగరంలో అమృత్ 1, 2 పథకాల అమలును వేగవంతం చేయాలని శుక్రవారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అసెంబ్లీలో మున్సిపల్ శాఖ మంత్రిని కోరారు. గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన ఈ పథకానికి ప్రస్తుత ప్రభుత్వం అంచనా నిధులను కూడా కేటాయించి పనులు పూర్తి చేస్తే, నగరంలో తాగునీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.