AP: ఆంధ్రా యానివర్సిటీలో విద్యార్థి మృతిపై మంత్రి లోకేష్ స్పందించారు. ‘గురువారం ఏయూలో విద్యార్థి ఫిట్స్తో చనిపోయారు. అంబులెన్స్లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం. కొందరు క్లాస్లు జరగకుండా కావాలనే అడ్డుకుంటున్నారు. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉంది. రాజకీయం చేస్తామంటే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.