NZB: భీమగల్ సర్కిల్ పరిధిలోని BT రోడ్లపై ధాన్యాలు ఆరబెడితే చర్యలు తీసుకుంటామని ఎస్సై కే.సందీప్ పేర్కొన్నారు. భీమగల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వ్యవసాయదారులు మక్కలు, వరి ధాన్యాలు, సోయా ఇతర పంటలు రోడ్లమీద పోయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.