JN: గ్రీవెన్స్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని వారు మాట్లాడారు. ఎప్పటికప్పుడు దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ జరిపి, సమస్యలను పరిష్కారించి, సంబంధిత దరఖాస్తు దారులకి సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.