VSP: దేశ వారసత్వ సంపదైన యోగాలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు వైజాగ్ సిద్ధమవుతుంది.ఈ నెల 21 అంతర్జాతీయ యోగా డేకి సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ పాల్గొనే ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది ఒకేచోట యోగా చేసేందుకు విశాఖ వేదిక అవ్వబోతోంది. సీఎం చంద్రబాబు సైతం స్వయంగా వచ్చి ఏర్పాట్లు పర్య వేక్షించారు. ఈ ఈవెంట్తో ప్రపంచం విశాఖ వైపు చూస్తుందని, గిన్నీస్ రికార్డ్ నెలకొల్పుతామని సీఎం అన్నారు.