అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతుల గుర్తింపు కోసం DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 132 మృతదేహాలను గుర్తించినట్లు గుజరాత్ వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. 131 డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. DNA పరీక్షలు ఆలస్యం కావటంతో మృతుల కుటుంబసభ్యులకు నిరీక్షణ తప్పటం లేదు. కాగా.. ఈ ప్రమాదంలో మొత్తం 279 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.