NLG: చందంపేట మండలం చిత్రియాల ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. యూనిఫామ్, బుక్స్ పంపిణీ చేశారా? లేదా అని అడిగారు. ఈసందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ చాక్లెట్లు పంపిణీ చేసి బాగా చదువుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.