AP: రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు పెట్టాలని టీటీడీ ధర్మకర్తల మండలి ప్రతిపాదించింది. పేరు మార్పుపై ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించింది. ‘బెంగళూరులో శ్రీవారి ఆలయం పెద్దది నిర్మించాలని అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారు. స్థలం కేటాయించగానే ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.