NLR: వెన్నుపోటు పరిపాలనకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం కావలి పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ చేశారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఐదు కోట్ల ఆంధ్రులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.