ATP: రాప్తాడు నియోజకవర్గంలోని పండమేరు వెంకటరమణ స్వామి దేవస్థానం సమీప పార్కులో “యోగాంధ్ర – 2025” మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులు, నాయకులు, మహిళలతో కలిసి పాల్గొన్నారు. యోగాసనాలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే తెలిపారు.